జనసమూహంలోకి దూసుకెళ్లిన బస్సు; ఐదుగురు మృతి
22-08-2026 12:36 PM
పాట్నా: బీహార్లోని పశ్చిమ చంపారణ్ జిల్లాలో(Champaran district) ఘోర ప్రమాదం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైన జనసమూహంపైకి ఒక బస్సు దూసుకెళ్లిన ఘటనలో కనీసం ఐదుగురు మరణించగా, మరికొందరు గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి సుమారు 10:45 గంటలకు లౌరియా పోలీస్ స్టేషన్(Lauria Police Station) పరిధిలోని పరావ్ తోలా వద్ద లౌరియా మార్గ్లో చోటుచేసుకుంది. "ట్రక్కును ఎదురెదురుగా ఢీకొనకుండా తప్పించుకునే ప్రయత్నంలో, బస్సు రోడ్డు పక్కన సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైన జనసమూహంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు," అని నార్కటియాగంజ్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డిపిఓ) అజయ్ ప్రకాష్ సింగ్ మీడియాకి తెలిపారు.






