calender_icon.png 4 June, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంతోమంది ఆత్మబలిదానాలతో తెలంగాణ వచ్చింది

02-06-2025 10:11:45 AM

తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలకపాత్ర పోషించింది

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అవతరణ వేడుకలు జరుగుతున్నాయి. బీజేపీ(Bharatiya Janata Party) కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు(Telangana Formation Day) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy), మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఎంతో మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ వచ్చిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం అహింసా పద్ధతిలో సాగిందని ఆయన గుర్తుచేసుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు అనుకూలమని అందరికంటే మందు నిర్ణయం తీసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపే అన్నారు. తెలంగాణ వచ్చాక నీళ్ల పేరుతో నిధుల దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ వస్తే.. ఉద్యోగాలు వస్తాయని యువత భావించింది.. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి కానీ.. యువతకు రాలేదని కిషన్ రెడ్డి చెప్పారు. ఏ ఆకాంక్షల కోసం ప్రజలు పోరాడారో గత పదేళ్లలో అవి నెరవేరలేదని తెలిపారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ ఇవాళ రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్లిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.