02-06-2025 12:08:42 PM
మందమర్రి,(విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ వేడుకలు(Telangana Formation Day) బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ లో సోమవారం బీజేపీ పట్టణ నాయకులు కొలేటి శివ ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అంతకు ముందు సీనియర్ నాయకులు రామటెంకి దుర్గరాజు తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ఎంపీల కృషితోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం బిజెపి అనేక ఉద్యమాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొద్దున ఓం ప్రకాష్, పిట్టల రాజమౌళి, చిల్లారపు సదానందం, పారిపెల్లి శ్రీనివాస్, చెలిమేటి చంద్రమౌళి, రాం కృష్ణయ్య, మొగిలి మల్లేష్ లు పాల్గొన్నారు.