calender_icon.png 26 June, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమలింగం కాలువ నిధుల కోసం

26-06-2025 12:08:10 AM

మంత్రి ఉత్తమ్‌ను కలిసిన ఎమ్మెల్యే కుంభం 

వలిగొండ, జూన్25 (విజయ క్రాంతి): భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని జలసౌదాలో ఇరిగేషన్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండ మండలంలోని భీమలింగం కాలువకు నిధులు కేటాయించాలని కోరడం జరిగింది.

అదేవిధంగా నియోజకవర్గంలోని బీబీనగర్, భువనగిరి మండలాలకు సంబందించిన బోల్లేపల్లి,  పోచంపల్లి మండలానికి సంబందించిన అలీనగర్ కాలువల మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని కోరారు. మూసీ వాగుకు సంబందించిన అన్ని ఫీడర్ కాలువలలో గుర్రుపు డెక్క ఆకు తొలగించుటకు మరియు నిర్వాహణకు ప్రతీ సంవత్సరం 1కోటి 20లక్షల బడ్జెట్ కేటాయించాలని కోరారు.