26-06-2025 12:07:08 AM
డిఎస్పి.వెంకట్ రెడ్డి పిలుపు
కల్వకుర్తి జూన్ 25 : విద్యార్థి యువత మాదకద్రవ్యాలు డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉంటూ వాటిని నియంత్రించేందుకు సహకరించాలని కల్వకుర్తి డిఎస్పి వెంకట్ రెడ్డి అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా బుధవారం పట్టణంలోని వైఆర్ఏం జూనియర్, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరైయి మాట్లాడారు.విద్యార్థి యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ భూతాన్ని వాడకం వల్ల యువత డ్రగ్స్ కి బానిసై బలైపోతున్నారని ఇది సరదాగా మొదలై అలవాటుగా తయారై వ్యసనంగా మారి విద్యార్థుల బంగారు భవిష్యత్తును పాడుజేస్తుందన్నారు.
ఆరోగ్యం చెడిపోయి జీవితం అర్దాంతరంగా ముగుస్తుందని, డ్రగ్స్ వాడకానికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. సైబర్ క్రైమ్ నివారణకు ప్రతి ఒకరు కృషి చేయాలని సైబర్ క్రైమ్ జరిగిందని తెలిసిన వెంటనే 1930కు కాల్ చేసి ఆన్లైన్లో కంప్లైంట్ చేయవచ్చని ఎస్ఐ మాధవరెడ్డి పేర్కొన్నారు.విద్య,విజ్ఞానము, చదువు సంస్కారం ,క్రమశిక్షణ, దేశభక్తి పెంపొంచుకోని విద్యార్థులు ముందుకు నడవాలని ప్రిన్సిపాల్ సదానందం గౌడు అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు యాదయ్య, బాలరాజు , రామకృష్ణ, యాదగిరి గౌడ్, హుస్సేన్, శ్రీనివాస్, శ్రీశైలం గౌడ్, ఇదన్నయ్య, ప్రభాకర్ గౌడ్, వెంకటయ్య, శరత్, కళాశాల విద్యార్థులుపాల్గొన్నారు.