25-05-2025 12:00:00 AM
మడమ నొప్పి.. చాలామందిని వేధించే సమస్యల్లో ఇదీ ఒకటి. కాలి చీలమండల ప్రాంతంలో వచ్చే ఈ నొప్పి కొన్నిసార్లు భరించలేనంతగా ఉండి.. నడవడానికి ఇబ్బందిగా మారుతుంది. ఎక్కువ బరువు, హై హీల్ చెప్పులు ధరించడం, తక్కువ సైజు చెప్పులు లేదా బూట్లు వేసుకోవడం, శరీరంలో కాల్షియంలో లోపించడం వల్ల మడమ నొప్పి వస్తుంది. ఇది తగ్గడం కోసం కొన్ని మందులు వాడినప్పటికీ మళ్లీ వస్తూనే ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలతో ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేసి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అందుకే మడమనొప్పి సమస్యతో బాధపడేవారు చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
ఒక గిన్నెలో నీటిని వేడి చేసి, దానిలో రెండు మూడు చెంచాల రాక్సాల్ట్ వేయాలి. ఆ తర్వాత ఈ నీటిలో పదాలను పది నిమిషాల పాటు ఉంచితే మడమ నొప్పి, వాపు తగ్గుతుంది.
ఒక క్లాత్లో మూడు నుంచి నాలుగు ఐస్ క్యూబ్స్ ఉంచి నొప్పి ఉన్నచోట లైట్గా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే మడమ నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది.
నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగం నూనెతో మర్దన చేసినా రక్తప్రసరణ పెరిగి, కండరాలకు ఉపశమనం కలిగి నొప్పి తగ్గుతుంది.