05-09-2025 12:58:08 PM
కరీంనగర్ (విజయక్రాంతి): వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం భగత్ నగర్ లోని శివశక్తి యూత్ క్లబ్, గజానన ఫ్రెండ్స్ అసోసియేషన్, అంజనాద్రి రోడ్ నెంబర్-2, ఈ-3 చోటలో విఘ్నేశ్వరులను మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Former Mayor Yadagiri Sunil Rao) దర్శించుకున్నారు. భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన గణేశుని వద్ద చివరి పూజ లడ్డు వేలం కార్యక్రమంలో సునీల్ రావు పాల్గొన్నారు.