18-09-2025 11:04:09 PM
చండూరు (విజయక్రాంతి): చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ బోయపల్లి సురేందర్ గౌడ్, యాదయ్య గౌడ్ కుటుంబాన్ని బిఆర్ఎస్ మాజీమంత్రి గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి, మునుగోడు బిఆర్ఎస్ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన గురువారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల సురేందర్ గౌడ్ తల్లి మాజీ సర్పంచ్ బోయపల్లి సత్తమ్మ మృతి చెందడంతో దశ దినకర్మలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో చండూరు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కోడి వెంకన్న, అన్నెపర్తి శేఖర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంతపు మధుసూదన్ రావు, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ , బిఆర్ఎస్ అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్ , ఉపాధ్యక్షులు కూరపాటి సుదర్శన్, బోయపల్లి అనంత్ కుమార్, కూరుపాటి లక్ష్మయ్య,తేలుకుంట్ల జానయ్య , బోయపల్లి రమేష్ , ఇరిగి రామన్న, బోడ శ్రీకాంత్, దాసరి వెంకటయ్య, కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.