25 March, 2026 | 2:10 PM

Breaking News

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •  

బీఆర్‌ఎస్ పని అయిపోయింది

19-09-2025 12:00 AM

త్వరలో కాంగ్రెస్ ముగుస్తుంది: ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాం తి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయిందని, మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పని సైతం ముగుస్తుందని, అలాంటి పార్టీల నాయకుల గురించి మాట్లాడడం సమయం వృధా అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎద్దేవా చేశారు. సాత్నాల మండలంలోని జామిని, జంగుగూడ గ్రామాల్లో గురు వారం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భం గా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరాగా, వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకుడు అనేవారు ప్రజలకు మాట ఇచ్చి మర్చిపోవద్దన్నారు.

అలాంటి పరిస్థితులు తనకు వస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు కరుణాకర్ రెడ్డి, సుభాష్, రమేష్ రోహిదాస్, రాము, మీరాబాయి, రేణుకా బాయి, ఆనంద్ రావు, అశో క్ రెడ్డి, ముకుందరావు పాల్గొన్నారు.