27 June, 2026 | 7:28 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

బీఆర్‌ఎస్ నాయకులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

12-05-2026 01:23 AM

భీమదేవరపల్లి, మే 11 (విజయక్రాంతి): ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ నాయకులను మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సోమవారం పరామర్శించారు.

ఎల్కతుర్తి మాజీ ఎంపీపీ తంగెడ శాలినీ భర్త, మాజీ మార్కెట్ డైరెక్టర్ తంగెడ మహేందర్, ఎల్కతుర్తి మాజీ సర్పంచ్ మాధవి భర్త గొల్లె మహేందర్ లు నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా కారు వేగంగా వచ్చి ఢీకొనగా తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వారు హనుమకొండలోని రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. దీంతో సోమవారం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆస్పత్రికి వెళ్ళి వారిని పరామర్శించి, వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ పార్టీ మండల ఆధ్యక్షులు పిట్టల మహేందర్, నాయకులు ఎల్తూరి స్వామి, సత్తూరి చంద్రమౌళి,జూపాక జడ్సన్, వేముల సమ్మయ్య భీమదేవరపల్లి మండల బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మండల సురేందర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు వేముల శ్రీనివాస్, మండల నాయకులు తదితరులు ఉన్నారు.