17 April, 2026 | 5:54 AM

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

06-04-2025 04:19 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో గల హనుమాన్ మందిర్ లో ఆదివారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు త్రాగునీరు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు.