తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దంపతులు
18-04-2026 12:22 AM
సత్తుపల్లి, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దంపతులు దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, పవిత్ర శేషవస్త్రాలు అందజేశారు. స్వామివారి అనుగ్రహాలతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటు న్నట్లు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.






