calender_icon.png 20 June, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

19-06-2025 06:02:41 PM

మేడ్చల్ అర్బన్: మేడ్చల్ మున్సిపల్ పరిధి 4వ వార్డ్ కిష్టాపూర్ లోని వీకర్ సెక్షన్ కాలనీ, అర్చన కాలనీలో 37.50 లక్షల సి అండ్ ఐ జి ఆర్ ఎస్ నిధులతో నూతనంగా నిర్మించనున్న పలు సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్(Telangana State Beverages Corporation Limited) త్రిసభ్య కమిటీ సభ్యులు రెడ్డంగారి నవీన్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మండల అధ్యక్షులు గోమారం రమణారెడ్డిలు స్థానిక నాయకులతో కలిసి పనులను ప్రారంభించారు.

కిష్టాపూర్ వీకర్ సెక్షన్ కాలనీలో 16 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు అర్చన కాలనీలో 16.75 లక్షల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్డు నిర్మాణ పనులు, కిష్టాపూర్ గ్రామ పరిధిలో 4.75 లక్షల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్డు నిర్మాణ పనులు నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో పూడూరు ఎఫ్ఎసిఎస్ డైరెక్టర్ వేముల సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తొంట యాదయ్య, ప్రభు, తొంట సుధాకర్,  అర్చన కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి,  ప్రధాన కార్యదర్శి సుధాకర్ చారి, కాలనీవాసులు కమలాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, గంగయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, హనుమంత రెడ్డి, సత్యనారాయణ, మల్లారెడ్డి, వేముల రంజిత్ రెడ్డి తదితరులు.