calender_icon.png 19 June, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాడ్వాయిలో యూరియా కోసం పడిగాపులు

19-06-2025 06:15:59 PM

తాడ్వాయి (విజయక్రాంతి): ప్రభుత్వం రైతులకు సరైన సమయంలో ఎరువులు అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం యూరియా ఎరువు కోసం రైతులు గంటల తరబడి పడిగాపులు కాశారు. ఉదయం నుంచి రైతులు యూరియా కోసం రైతు వేదిక వద్దకు వచ్చి వరుసలో నిల్చున్నారు. యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు.. నిలబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూరియా లేదని తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురై వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు సకాలంలో యూరియా ఎరువు అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.