25-06-2025 01:42:18 AM
-ఏడుగురిపై కేసులు, పరారీలో ప్రధాన నిందితులు
- వివరాలు వెల్లడించిన సైబర్క్రైమ్ డీసీపీ సాయిశ్రీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 24 (విజయక్రాంతి)/శేరిలింగంపల్లి: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ను టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా ప్రమోట్ చేస్తన్న ఓ ముఠా గుట్టును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఏడుగురు మీద కేసులు నమోదవగా నలుగురిని అరెస్టు చేశారు. వారంతా ఉన్నత చదువులు చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్న వారు కావడం గమనార్హం. ఈ నెల 13న మియాపూర్కు చెందిన ఓ విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, టెలిగ్రామ్ ఛానళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇందులో భాగంగా చిన్నంశెట్టి నాగ రాకేష్, పొత్తవాతిని దీపక్, గుగులోత్ శ్రీరామ్ నాయక్, హేమంత్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సోషల్ మీడి యాలో చురుగ్గా ఉంటూ, తమ టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా వేలాది మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. పలు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ ప్ర మోషన్ ద్వారా నిందితులు ఒక్కొక్కరు కమీషన్ కింద రూ.50 నుంచి రూ.60 లక్షల వర కు సంపాదిస్తున్నట్లు తెలిపారు. మొత్తం ఏడుగురిపై కేసులు నమోదు చేయగా, నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.