25-06-2025 01:42:29 AM
కేసు వివరాలు వెల్లడించిన ఏఈఎస్ శ్రీనివాస్ రెడ్డి
రాజేంద్రనగర్, జూన్ 24: నిషేధిత ఎండిఎంఏ డ్రగ్స్ కలిగి ఉన్న ఓ వ్యక్తిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. రాజేంద్రనగర్ లోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మంగళవారం మధ్యా హ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.
మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న మెహిఫిల్ హోటల్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఓ వ్యక్తి నిషేధిత ఏండిఎంఏ డ్రగ్స్ కలిగి ఉన్నాడనే విశ్వసనీయ సమాచారంతో శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కు చెందిన వట్టి జగదీశ్వర్ రెడ్డి (25) గా పోలీసులు గుర్తించారు.
అతడి నుంచి 23 గ్రాముల ఏం డి ఎం ఏ డ్రగ్స్, బజాజ్ పల్సర్ ద్వి చక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడుజగదీశ్వర్ రెడ్డి పై ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో గత ఫిబ్రవరి నెలలోనూ కేసు నమోదు అయినట్లు శంషాబాద్ ఎక్సైజ్ ఏ ఈ ఎస్ ఏ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ప్రధాన సరఫరాదారుడు బెంగళూరుకు చెందిన సైఫ్ షరీఫ్ గా గుర్తించగా అతడు పరారీలో ఉన్నాడు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ లక్షకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు