4 April, 2026 | 3:26 PM

Breaking News

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •  

ఆలూరు స్టేజ్ వద్ద లారీ బీభత్సం.. నలుగురు మృతి

02-12-2024 08:54 PM

రంగారెడ్డి,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెవేళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద హైదరాబాద్ - బీజాపూర్ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపు తప్పి రోడ్డుకు ఇరువైపుల కూరగాయలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లింది. లారీ వేగంగా దూసుకొచ్చి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక లారీ క్యాబిన్లో ఇరుక్కున్న  డ్రైవర్ ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు లారీ వెళ్తుంది. లారీ అదుపుతప్పిన విషయాన్ని చిరువ్యాపారులు దూరం నుంచే గమనించి ప్రాణ భయంతో పరుగులు తీశారు. చిరువ్యాపారులు అప్రమత్తంకావడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలికి కిలోమీటర్ దూరంలో నిన్న కూడా రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డు విస్తరించాలని ఏళ్ల తరబడి కోరుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.