calender_icon.png 9 June, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక డిపాజిట్‌కు నలుగురు నామినీలు

04-08-2024 02:02:42 AM

బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులకు క్యాబినెట్ ఓకే

సేవింగ్స్ డిపాజిట్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాకు ఇకనుంచి నలుగురి వరకూ నామినీలుగా నిర్ణయించుకునే అవకాశం రానుంది. ఇప్పటివరకూ డిపాజిట్ ఖాతాలకు ఒక వ్యక్తినే నామినేట్ చేసుకునే వీలుంది. అయితే బ్యాం కింగ్ వ్యవస్థలో క్లెయిం చేయని డిపాజిట్లు సమస్యను పరిష్కరించేదిశగా నామినీల పెంపుదల ను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులకు కేంద్ర క్యాబినెట్ అనుమతి తెలిపింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్వహణ లోని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌కు (పీపీఎఫ్) మాత్రం ఒకరికంటే ఎక్కువ నామినీలను జతచేసే అనుమతి ఉంది.

తాజాగా డిపాజిట్లకు నామినీల పెంపుతో ఖాతాదారు మరణం తర్వాత జాయింట్ ఖాతాదారులు, వారసులు డిపాజిట్ నిధుల్ని సులభంగా తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. బ్యాంకింగ్ చట్ట మార్పులపై బిల్లును త్వరలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు. అప్పుడే నామినీల నిబంధనల వివరాలు వెల్లడవుతాయన్నది సమాచా రం. ఈ ఏడాది మార్చి చివరినాటికి దేశంలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల మొత్తం రూ. 78,000 కోట్లకు చేరింది. ఈ విషయమై ఆందోళన వ్యక్తంచేసిన సీతారామన్ ఆ డబ్బును హక్కుదారులకు బదిలీ చేయాలంటూ బ్యాంక్‌లు, మ్యూచువల్ ఫండ్లు, ఇతర ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీలను కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు క్లెయింకాని డివిడెండ్లు, బాండ్ల డబ్బును ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్‌కు (ఐఈపీఎఫ్) బదిలీ చేసేందుకు అనుమతిస్తూ చట్ట సవరణల్ని ప్రతిపాదించారు.