29-05-2025 07:44:51 PM
గడువు తేదీ జూన్ 21..
మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): 2026లో జరగనున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులకు ముంబైలోని హజ్ కమిటీ(Haj Committee) ఆధ్వర్యంలో నడుస్తున్న "హజ్ హౌస్ రెసిడెన్షియల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్(Haj House Residential Coaching Institute)" వారు అందిస్తున్న ఉచిత శిక్షణనకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా(MD. Yakub Pasha) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఉచిత శిక్షణ పొందేందుకు గాను సదరు సంస్థ వారు జులై 13న హైదరాబాద్ లో అర్హత పరీక్ష నిర్వహించబడుతుందని, అర్హత పరీక్షలో మెరిట్ సాధించిన వారికి ఒక సంవత్సరం పాటు ఉచిత శిక్షణతో భోజన, వసతి సౌకర్యం కల్పించటం జరుగుతుందన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు తమ వివరాలను జూన్ 21 లోపు www.hajcommittee.gov.in అనే వెబ్సైట్ నందు రూ.100 పరీక్ష రుసుము చెల్లించి ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 8520860785 అనే నంబర్ కు సంప్రదించాలని అన్నారు.