29-05-2025 07:50:39 PM
నిర్మల్ (విజయక్రాంతి): గోవధ నిషేధ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని నిర్మల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి(SP Upender Reddy) పశువైద్య సహాయ అధికారి కరుణాకర్ అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బక్రీద్ పండుగ నేపథ్యంలో గోవధ నిషేధ చట్టంపై అవగాహన కల్పించి ఆరోగ్యవంతమైన గోవులను మాత్రమే ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా లేని గోవులను చంపవద్దని చిన్న లేగదొడ్లు ఉన్న వాటిని మినాయింపు ఇవ్వాలని చట్టంపై పూర్తిగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రత్నా కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, సిఐ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.