29-05-2025 07:40:20 PM
బీజేపీ నాయకులు రఘురాం గౌడ్..
హన్వాడ: నచ్చిన పని కాదు వచ్చిన పని చేస్తూ ముందుకు సాగితేనే అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని బీజేపీ నాయకులు ఓ రఘురాం గౌడ్(BJP leaders O Raghu Ram Goud) అన్నారు. మండలం పెద్దదర్పల్లి గ్రామంలో బీజేపీ నాయకులు రఘురాం గౌడ్ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజల కొరకు బడుగు బలహీన వర్గాలైనటువంటి యువకులు మహిళలు మొదలగు వారికొరకై తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం పథకాలను, పాలమూరు ఎంపీ శ్రీమతి అరుణమ్మ సూచన మేరకు పీఎం విశ్వకర్మ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి లబ్ధిదారులకు UDYAM ASSIST CERTIFICATE (PM Vishwakarma Beneficiaries) బీజేపీ నాయకులు రఘురాం గౌడ్ అందజేశారు. శిక్షణ పొందిన పనిలో పరిపక్వత సాధించాలని సూచించారు. భూత్ అధ్యక్షులు జిల్లెల గోపాల్, శీను సాగర్, వినీత్ గౌడ్, మున్నూరు అంజయ్య, జిల్లెల్ల గోవర్ధన్, శేఖర్, చందు, ఆకాష్, కిష్టయ్య, శ్రీశైలం, రమేష్, మనోహర్, గ్రామ పెద్దలు మహిళలు తదితరులు ఉన్నారు.