01-06-2025 12:08:35 AM
రూ.1327 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): 2025 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి రూ.2,654 కోట్లు కేటాయించిన విష యం తెలిసిందే. హైదరాబాద్ సిటీ ఎన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్ పేరుతో ఈ కేటాయిం పులు చేసింది. కాగా ఇందులో ఈ ఆర్థిక సంవత్స రం సెప్టెంబర్ వరకు సంబంధించిన రూ. 1,327 కోట్లను శుక్రవారం విడుదల చేసింది.
ఈ మేరకు శనివారం ట్యాంక్ంబండ్లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాల యం పత్రికా ప్రకటన వెలువరిచింది. జీహెచ్ఎంసీకి ఎప్పటికప్పుడు నిధు లు విడుదల చేస్తున్న ప్రభుత్వం, తద్వారా అభివృద్ధికి దోహదపడుతోంది. దీంతో నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తుంది. కాంట్రాక్టర్లకు సైతం సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయి.