calender_icon.png 2 June, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రైవేటు డ్రైవర్లు!

01-06-2025 12:07:53 AM

  1. హైదరాబాద్‌లో ఇక ఆర్టీసీ డ్రైవర్లు ఉండరా..?
  2. నగరంలో ఇప్పటికే ఆర్టీసీకి 2వేల ఎలక్ట్రిక్ బస్సులు
  3. మరో 800 బస్సుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన రాష్ట్రం
  4. ప్రైవేటు ఈవీ బస్సులకు ఆర్టీసీ డ్రైవర్లను కొనసాగించేలా నిబంధనలు మార్పు చేస్తే మేలు 
  5. డ్రైవర్లు, సిబ్బందికి అవకాశం కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన తెలంగాణ

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): ఆర్టీసీలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతామని తెలంగాణ సర్కారు చెప్పినట్లుగానే జరుగుతోంది. కాలుష్య నియం త్రణ కోసం ఇది చక్కటి ఆలోచనే అయినా ఇప్పటివరకు తీసుకొచ్చిన ఈవీ బస్సులన్నీ కొన్ని  ప్రైవేటు కంపెనీలకు చెందినవే కావడంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం, యాజ మాన్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం విధానాల ప్రకారం ఆర్టీసీలో ఉన్న అద్దెబస్సుల విధానాన్ని కూడా కాదని నేరుగా కొన్ని ప్రైవేటు కంపెనీల ద్వారా ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకొస్తున్నారు. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఇప్పటికే 2వేల ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం తెలంగాణకు మంజూరు చేసింది. వీటిని గ్రాస్ కాస్ట్ కాం ట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో అందించారు. ప్రస్తు తం నగరంలో 2,800 సిటీబస్సులుండగా ఇప్పటికే 2వేల ఈవీబస్సులను కేంద్రం మం జూరుచేసింది.

మరో 800 బస్సులు ఇవ్వాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి కుమారస్వామిని కలిసి విజ్ఞప్తి చేశారు. అంటే త్వరలో ఆ 800 బస్సులు కూడా వస్తాయి. అంటే మొత్తం 2,800 బస్సులు కూడా ప్రైవే టు రంగానికే దక్కుతాయి. సిటీలో ఉన్న 2,800 ఆర్టీసీ బస్సులను జిల్లాలకు పంపిస్తారు. ఫలితంగా నగరంలో పనిచేసే డ్రైవర్లు, మెకానిక్స్, ఇతర సిబ్బంది సుమారు 7వేల మందిని సైతం జిల్లాలకు పంపించేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే కొన్ని డిపో లను ఇచ్చీఇవ్వనట్లుగా ప్రైవేటు ఈవీ బస్సులను నిర్వహిస్తున్న సంస్థలకు కట్టబెట్టారు. 2,800 బస్సులు వస్తే నగరంలోని అన్ని డిపోలను కూడా ప్రైవేటుకు అప్పగించే ప్ర మాదం కనిపిస్తోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

3వేల ఉద్యోగ నియామకాలు చేపడతామన్న ప్రభుత్వం తీరుకు విరు ద్ధంగా ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించాలని రీజినల్ మేనేజర్లకు సర్క్యులర్ జారీ చేసింది. ఇవన్నీ చూస్తుంటే ఆర్టీసీలో ఉద్యోగుల మనుగడపై సందేహాలు తలెత్తుతున్నా యని రవాణా రంగ నిపుణులు అంటున్నారు. 

కండక్టర్ మినహా అంతా ప్రైవేటు పరమే..

ఆర్టీసీ సగటు లెక్కల ప్రకారం ఒక బస్సు కు ఐదుగురు ఉద్యోగుల లెక్కన కార్మికులు పనిచేస్తారు. డ్రైవర్, కండక్టర్, మెకానిక్, శ్రామిక్, సహా మరో ఉద్యోగి ఒక్కో బస్సు కోసం సేవలు అందిస్తారు. ప్రైవేటు ఈవీలు వస్తే కండక్టర్ మినహా మిగతా వారెవరికీ డిపోల్లో పని ఉండదు. అంటే ఈవీలన్నీ కేం ద్రంలో ఉన్న ప్రస్తుత జీసీసీ విధానంలో వ స్తే మాత్రం ఆర్టీసీ కార్మికుల మనుగడకు ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. 

ప్రైవేటు ఈవీ బస్సులకు ఆర్టీసీ డ్రైవర్లను కొనసాగించేలా..

పీఎం ఈ డ్రైవ్ పథకం కింద కేంద్ర ఇచ్చే బస్సులకు ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లు బస్సు నిర్వహణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగా ణ సర్కారు కేంద్రాన్ని కోరింది. ఢిల్లీలో కేంద్రమంత్రి కుమారస్వామిని ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంటే జీసీసీ మోడల్‌లో ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సబ్సిడీని ఆర్టీసీకి ఇస్తే నేరుగా బస్సులను తామే కొంటామని ప్రభుత్వం చెప్తోంది.

కానీ కేం ద్రం ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా లేదా తెలియదు. ఇప్పటికే జీసీసీ నిబంధనల మేరకు 2,800 బస్సులు మంజూరు అ య్యాక నిబంధనలు మార్చేందుకు అవకాశం ఉంటుందా అనేది ప్రశ్నగా మారింది. ఇక మరోవైపు ఆర్టీసీ డీజిల్ బస్సుకు రెట్రోఫిట్టెడ్ (డీజిల్ బస్సును ఈవీగా మార్చడం) చేపట్టగా అది విజయవంతమై నగరంలో రాకపోకలు సాగిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు రెట్రో ఫిట్‌మెంట్ అవకాశం కల్పించాలని కూడా కోరారు. కనీ సం ఈ పద్ధతిని అయినా కొనసాగిస్తే ఆర్టీసీ కార్మికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కార్పోరేట్ అడుగులకు మడుగులు ఒత్తే ప్రభుత్వాలు కార్మికులకు మేలు చేసేందుకు కట్టుబడి ఉంటాయా అనేది ప్రశ్నార్థ కంగా మారింది. 

కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే సమ్మె తప్పదు: ఆర్టీసీ జేఏసీ

విద్యుత్ బస్సులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ పేరిట కొనుగోలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో ఈ బస్సులు తీసుకొస్తే సహించబోమని జేఏసీ స్పష్టం చేసింది. యాజమాన్యం చర్యల వల్ల ప్రభుత్వం మీద కార్మికులకు నమ్మకం కోల్పోయే  పరిస్థితి ఏర్పడిందని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో చైర్మన్ హనుమంత్ ముదిరాజ్,  వైస్ చైర్మన్, థామస్‌రెడ్డి స్పష్టం చేశారు.

ప్రభుత్వం మీద నమ్మకంతో ఆర్టీసీ సమ్మెను తా త్కాలికంగా వాయిదా వేసుకున్నామని.. కార్మిక వ్యతిరేక విధానాలను కొనసాగిస్తే సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈవీ బస్సు ల సమస్యతో ఉన్న కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో పడినట్లుగా భావిస్తుంటే..

ఆర్టీసీలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ ఏజన్సీల ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఈవీ బస్సులను తేవడం, గ్యారేజ్‌లు మొత్తం ప్రైవేటు చేయడం వంటి చర్యలు విస్తుగొలిపేలా ఉన్నాయని ఆర్టీసీ జేఏసీ అంటోంది.