calender_icon.png 6 June, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలస్తీనా ప్రజలకు అన్ని దేశాలు సాయం అందించాలి

01-06-2025 12:09:40 AM

- పీపుల్స్ సాలిడారిటీ ఫర్ పాలస్తీనా సమావేశంలో 

- ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

ముషీరాబాద్, మే 31 (విజయక్రాంతి) : పాలస్తీనా ప్రజలకు ఆహారం, మెడిసిన్, దుస్తులు భారత్ అందించి ఆదుకోవాలని, భారత్ తో పాటు అన్ని దేశాలు, యూఎన్ ఓ స్పందించి పాలస్తీనీయులకు అండగా నిలవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పీపుల్స్ సాలిడారిటీ ఫర్ పాలస్తీనా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ ఎం. కోదండరాం, సీపీఐ మాజీ ఎంపీ అజీజ్ పాషా, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ మాట్లాడారు.

పాలస్తీనాలో శాంతి నెలకొల్పడానికి భారత్‌తో పాటు అన్ని దేశాలు యూఎన్‌వో స్పందించాలని కోరా రు. గాజాపై బాంబు వర్షం కురిపిస్తూ ఇజ్రాయిల్ అమాయక ప్రజల ప్రాణాలను పొట్టనబెట్టుకుందని, వెంటనే శాశ్వత కాల్పుల విరమణ ప్రకటించి పాలస్తీనీయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాలస్తీనాను ఆక్రమించుకోవడానికి అమెరికా కుట్ర చేస్తుందని ప్రజలు దీనిని తిప్పికొట్టాలన్నారు. గాజాలో భయానక పరిస్థితి నెలకొండని ఎప్పుడు ఏ దాడి జరుగు తుందోనని ప్రజలు భయపడుతున్నారని వారన్నారు. పాలస్తీనీయులకు పూర్తి సంఘీభావం తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నేతలు ఉమర్ అహ్మద్ హసీజ్, అబ్బాస్, సారా మాథ్యూస్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమకారుల అకాంక్షలు కాంగ్రెస్ నెరవేరుస్తుంది

ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తెలంగాణ ఉద్యమ కారుల సంఘాలు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సెక్రటరీ జనరల్ ప్రఫుల్ రాంరెడ్డి, తెలంగాణా అకాంక్షల వేదిక కన్వీనర్ కుమార స్వామి, రామగిరి ప్రకాష్, చంద్రన్న ప్రసాద్, అంజిరెడ్డి, పెద్ద యాదగిరి, నగేష్, ధనలక్ష్మి, అంజలి, సుజి స్వరూప రాణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.