calender_icon.png 1 May, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంగ్ల విభాగంలో గద్దల ప్రేమ్ కుమార్‌కు డాక్టరేట్

30-04-2025 12:00:00 AM

హనుమకొండ, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పరిశోధకులు గద్దల ప్రేమ్ కుమార్  డాక్టరేట్ సాధించాడు. ‘మల్టీ కల్చరలిజం ఇన్ నీల్ బిసుందత్ ఫిక్షన్ లో బహుళ జాతివాదం‘ అనే అంశంపై చేసిన వివరణాత్మక పరిశోధనకు కాకతీయ యూని వర్సిటీ డాక్టరేట్ ప్రకటిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.

కాకతీయ యూనివ ర్సిటీ కి చెందిన ఆంగ్ల విభాగం ప్రొఫెసర్ ఎం.ప్రభాకర్ గారి పర్యవేక్షణలో గద్దల ప్రేమ్ కుమార్ పరిశోధన పూర్తి చేశారు. అలాగే  జాతీయ, అంతర్జాతీయ  సెమినార్ లలో పలు పరిశోధన పత్రాలను సమర్పిం చారు.

వరంగల్ జిల్లా కేంద్రంలోని ఖిలా వరంగల్ కు చెందిన గద్దల ప్రేమ్ కుమార్ సీకేఎం కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తు న్నారు. ఈ సందర్భంగా డాక్టరేట్ సాధించిన గద్దల ప్రేమ్ కుమార్ ను యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, సహుద్యోగులు అభినందనలు తెలిపారు.