15 April, 2026 | 1:39 PM

Breaking News

అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •  

మున్సిపల్ కమిషనర్లుగా గజానంద్, రమేష్

25-06-2025 01:49 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్/బెల్లంపల్లి అర్బ న్ జూన్ 24 (విజయక్రాంతి): ఆసిఫాబాద్, బెల్లంపల్లి  మున్సిపల్ కమిషనర్లుగా గజానంద్, తన్నీరు రమేష్‌ను నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తం గా 56 మంది మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వారికి గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ గా పదోన్నతులు కల్పిస్తూ పలు ప్రాంతాలకు బదిలీ చేశారు. అందులో భాగంగా గజానంద్‌ను ఆసిఫాబాద్‌కు కేటాయించారు.

బెల్లంపల్లి  మున్సిపాలిటీలో ఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న  భుజంగరావు ఆసిఫాబాద్ ఇం చార్జ్ మున్సిపల్ కమిషనర్ ఇన్నాళ్లు కొనసాగారు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న  శ్రీనివాసరావు హెచ్‌డి ఎంఎకు బదిలీ అయ్యారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో మేనేజర్‌గా పనిచేస్తున్న రమేష్ ప్రమోషన్‌పై బెల్లంపల్లి కమిషనర్‌గా బదిలీ అయ్యారు.