25-06-2025 01:50:04 AM
కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్,జూన్, 24: జిల్లాను పారిశ్రామిక, పర్యాటక రంగాలను అభివృద్ధి చేసి యువత కు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం మోమిన్ పేట్ మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శవాసన సభ సభాపతి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన గావించారు.
ఈ సందర్భంగా 70 లక్షల వ్యయంతో పిడబ్ల్యుడి రోడ్డు నుండి బాల్ రెడ్డి గూడ వరకు బి.టి రోడ్డుకు శంకుస్థాపన , 60 లక్షలతో బాల్ రెడ్డి గూడాలో చేపట్టిన అంతర్గత రోడ్లకు ప్రారంభోత్సవం,67 లక్షల వ్యయంతో పిడబ్ల్యుడి నుండి ఎంకేపల్లి వరకు చేపట్టే బి.టి రోడ్డు పనులకు శంకుస్థాపన, మోమినిపేట్ మండల కేంద్రంలో 80 లక్షల వ్యయంతో నిర్మించిన డిసిసిబి భవనం ప్రారంభం, కేసారం లో 3.06 కోట్ల వ్యయంతో చేపట్టే 33/11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ కు సభాపతి ప్రారంభోత్సవం గావించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సభాపతి ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతూ...రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వికారాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కావలసిన నిధులను మంజూరు చేస్తున్న అన్నారు.గత పదేళ్ళలో వికారాబాద్ నియోజకవర్గంలోని రోడ్లు దారుణంగా అయ్యాయని , రోడ్లు బాగాలేక కొన్ని గ్రామాల పిల్లగాళ్ళకు పిల్లనిచ్చే పరిస్థితి లేదని నేను అసెంబ్లీలో చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
పదేళ్ళలో రోడ్లు బాగాలేక మీరందరూ ఎంత ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసని అందుకే మన ప్రభుత్వం వచ్చాక మొదట రోడ్లను బాగు చేయిస్తున్నానని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 600 కోట్ల రూపాయలను రోడ్డ కోసం మంజూరు అయ్యాయని,గల్లి గల్లీకి ప్రతి గ్రామంలో 60 లక్షల నుండి కోటి రూపాయలతో సిసి రోడ్లను వేయి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఊర్లకు వచ్చే తారు రోడ్లను కూడా అధిక నిధులను కేటాయిస్తూ పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధుడు, గత ముఖ్యమంత్రి చేసిన అప్పులను తీర్చడంతో పాటుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను మీకోసం అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. మహలక్ష్మి పథకం ద్వారా మా అక్కా చెల్లెల్లు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ఆయన అన్నారు. అధికారులుపాల్గొన్నారు