calender_icon.png 25 June, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలి

25-06-2025 01:48:11 AM

బీజేపీ నేత బాలాజీ సూర్య వంశీ 

రాజేంద్రనగర్, జూన్ 24: నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నేతలు పార్టీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని కార్వాన్ నియోజకవర్గం నానల్ నగర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బాలాజీ సూర్య వంశీ సూచించారు. డివిజన్లో వివిధ మోర్చాలకు ఆయన మంగళవారం అధ్యక్షులను నియమించారు.

ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ గా విద్యాసాగర్, ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ గా రాజేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా అనురాధ, యువ మోర్చా అధ్యక్షుడిగా వెంకటేష్, అదేవిధంగా మైనార్టీ మోర్చా అధ్యక్షురాలిగా మియాబాయ్ ని నియమించి ఆయన నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా బాలాజీ సూర్య వంశీ మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి అమర్ సింగ్, పలువురు నేతలుపాల్గొన్నారు.