25 March, 2026 | 3:05 AM

గాలికుంటు టీకా జిల్లా ప్రచార రథం ప్రారంభం

25-03-2026 12:50 AM

మున్సిపల్ చైర్మన్ యెర్నేని కుసుమ వెంకటరత్నం బాబు

కోదాడ, మార్చి 24 : కోదాడ పట్టణ  ప్రాంతీయ పశువైద్యశాలలో గాలి కుంటు టీకా  జిల్లా ప్రచార రథాన్ని మున్సిపల్ చైర్మన్ యెర్నేని కుసుమవెంకటరత్నం బాబు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాలికుంటు టీకా పై జిల్లా ప్రజలకు అవగాహన నిమిత్తం ఊరూరా తిరిగడానికి  ప్రచార రథం ఏర్పాటు చేయడం అత్యంత మంచి కార్యక్రమం అన్నారు. 

కార్యక్రమంలో జిల్లా పశువైద్య , పశుసంవర్ధక అధికారి డా బోడేపూడి శ్రీనివాసరావు, జిల్లా గ్రంధాలయం చైర్మన్ వంగవీటి రామారావు వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్,   మున్సిపల్ కమిషనర్ రమాదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య, మున్సిపాలిటీ  6 వ వార్డు కౌన్సిలర్ నాగేంద్రమ్మ, ప్రముఖ లాయరు కె యల్ ఎన్ ప్రసాద్ , సిబ్బంది రాజు చంద్రకళ , కర్ణ, సాగర్, రాజేష్ పాల్గొన్నారు.