19-06-2025 12:23:02 AM
కరీంనగర్ క్రైం,జూన్18(విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో స్వాధీనం చేసుకున్న 133.8 కిలోల గంజాయిని బుధవారం ధ్వంసం చేసినట్లు కరీంనగర్ పోలీస్ క మీషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు.
మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామం లో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్లో పోలీస్ కమీషనర్ గారి సమక్షంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ లు వేణుగోపాల్, విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్లు పుల్లయ్య, సంజీవ్, రజినీకాంత్, అలాగే ఇన్సినరేటర్ ప్లాంట్ కు చెందిన తిరుపతి మరియు ప్రభాకర్ రెడ్డిలతో పాటు ఇతర అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు.