16 March, 2026 | 5:35 AM

ముగిసిన గాయత్రి అంత్యక్రియలు

07-10-2024 01:11 AM

కూకట్‌పల్లి, అక్టోబర్ 6: గుండెపోటుతో చనిపోయిన సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి అంత్యక్రియలు ఆదివారం కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లోని కైలాసవాసం శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. చితికి గాయత్రి భర్త నిప్పు అంటించారు. కూతురిని చివరి చూపు చూసి రాజేంద్రప్రసాద్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.