11 July, 2026 | 9:37 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

కనుల పండువగా గిరి ప్రదక్షిణ

02-11-2024 02:32 AM

లక్ష్మీనరసింహ నామస్మరణతో మారుమోగిన యాదాద్రి

యాదాద్రిభువనగిరి, నవంబర్ 1 (విజయక్రాంతి): దుష్ట శిక్షణ..శిష్టరక్షణకు శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఉత్కృష్టమైన నృసింహుడి ఆవిర్భావ తిరునక్షత్రం స్వాతి వేడుకలు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దీపావళి వరుస సెలవులతో పాటు స్వాతి పుణ్యతిథి, గిరిప్రదక్షిణ నేపథ్యంలో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా నూతనంగా భాద్యతలు చేపట్టిన ఎం.హనుమంతరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అదే విధంగా  ఆయన గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.

అలాగే కొండపై కొలువై ఉన్న లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింయాకె. అమ్మవారి ఉత్సవ మూర్తుల ఎదుట ఆలయ ఖజానాలోని వజ్ర, స్వర్ణ, వెండి ఆభరణాలతో పాటు నగదును పెట్టి, పాంచ రాత్రగమ శాస్త్ర ప్రకారం లక్ష్మీదేవి పూజలు నిర్వహించారు.