calender_icon.png 25 June, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమకు అడ్డు చెప్పిందని కన్నతల్లిని చంపిన బాలిక

25-06-2025 01:45:57 AM

- ప్రియుడు, అతడి సోదరుడితో కలిసి హత్య

- జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

- నిందితుల్లో ఇద్దరు మైనర్లు

- మృతురాలు చాకలి ఐలమ్మ ముని మనుమరాలు 

హైదరాబాద్ సిటీబ్యూరో/మహబూబాబాద్, జూన్ 24 (విజయక్రాంతి)/ కుత్బుల్లా పూర్: తన ప్రేమకు అడ్డు చెపుతున్నదని కన్నతల్లిని తన ప్రియుడు, అతడి సోదరుడితో కలిసి ఓ బాలిక కిరాతకంగా హత్య చేసింది. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అంజలి అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లతో జీడిమెట్లలో ఉంటున్నది. అంజలి చాకలి ఐలమ్మ ముని మనుమరాలు. సాంస్కృతిక సారథి కళాకారిణిగా పనిచేస్తున్నది. అంజలి(౩౯) పెద్ద కూతురు తేజశ్రీ(16) పదో తరగతి చదువుతున్నది.

ఎనిమిది నెలల క్రితం తేజశ్రీకి నల్లగొండకు చెందిన పగిళ్ల శివ(19)తో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. పరిచ యం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ విష యం తెలుసుకున్న అంజలి పదవ తరగతికే ప్రేమ వ్యవహారం ఏమిటని ప్రశ్నించడంతో వారం రోజుల క్రితం బాలిక శివతో వెళ్లిపోయింది. అంజలి ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. అనంతరం ప్రియుడు శివ తేజశ్రీని పోలీసులకు అప్పగించాడు. దీంతో పోలీసులు శివకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయి తే తన ప్రేమకు తల్లి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు శివ, అతడి సోదరుడు యశ్వంత్(18)తో కలిసి అంజలిని హత్య చేయాలని తేజశ్రీ ప్లాన్ చేసింది. 

ఇనుగుర్తిలో విషాదం 

అంజలి మృతితో ఆమె స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో తీవ్ర విషాదం నెలకొంది. ఇనుగుర్తికి చెందిన సట్ల ధనమ్మ, మల్లయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు శోభ, అంజలి, జ్యోతి. తండ్రి మల్లయ్య మరణంతో తల్లి ధనమ్మ కూడా అంజలితో పదేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అంజలి తెలంగా ణ ఉద్యమంలో ధూమ్ దామ్ కార్యక్రమా ల్లో ప్రదర్శనలు ఇచ్చింది.

ఆ తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆమెకు తెలంగాణ సాంస్కృ తిక సారథి బృందం సభ్యురాలిగా ఉద్యోగం ఇచ్చింది. పోస్టుమార్టం అనంతరం అంజలి మృతదేహాన్ని మంగళవారం రాత్రి ఇనుగుర్తికి తీసుకువచ్చారు. కాగా తెలంగాణ సాం స్కృతిక సారథి కళాకారిణి సట్ల అంజలి గత నెల వరకు మహబూబాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహించేది. ఇటీవల ఆమె మేడ్చల్ మల్కాజి గిరి జిల్లాకు బదిలీపై వెళ్లిందని మహబూబాబాద్ డీపీఆర్వో రాజేంద్రప్రసాద్ తెలిపారు. 

సుత్తితో తలపై కొట్టి, కత్తితో మెడ కోసి..

ప్రియుడు శివ, యశ్వంత్ సోమవారం సాయంత్రం నల్లగొండ నుంచి జీడిమెట్లకు వచ్చారు. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా యశ్వంత్ సహాయంతో శివ వెనుక నుంచి చున్నీతో మెడను బిగించి హతమార్చాలని ప్రయత్నించారు. అయినా అంజలి ప్రాణం పోకపోవడంతో తేజశ్రీ సుత్తితో అంజలి తలపై పలుమార్లు బలంగా కొట్టింది. శివ సోదరుడు కత్తితో అంజలి గొంతు కోశాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.