calender_icon.png 26 June, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన అవసరం

25-06-2025 01:44:57 AM

వీబీఐటీ చైర్మెన్ డాక్టర్ గౌతంరావు

ఘట్ కేసర్, జూన్ 24 : విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన ఎంతో అవసరమని విజ్ఞాన భారతి విద్యా సంస్థల చైర్మెన్ డాక్టర్ ఎన్. గౌతంరావు అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ అవుషాపూర్ లోని విజ్ఞాన భారతి విద్యా సంస్థలో ఆరు రోజుల పాటు నిర్వహించిన మోడలింగ్ లో తాజా ధోరణులు అనే శీర్షికతో జాతీయ స్థాయి ఎఫ్‌ఎపి కార్యక్రమం ముగిసింది.

ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విద్యా సంస్థ చైర్మెన్ డాక్టర్ గౌతంరావు, సెక్రటరీ డాక్టర్ జి. మనోహర్ రెడ్డి హాజయ్యారు. ఈశిక్షణా కార్యక్రమంలో విఎల్‌ఎస్‌ఐ డిజైన్ రంగంలో జరుగుతున్న తాజా అభివృద్ధులు, పరిశోధన దిశలు మరియు సాఫ్ట్ వేర్ టూల్స్ ఉపయోగించి ప్రాక్టికల్ శిక్షణను అందించారు. ఈ ఎఫ్ డి పి ద్వారా విద్యార్థులకు, పరిశోధకులకు, అధ్యాపకులకు సాంకేతిక నైపుణ్యాల పరంగా ఎంతో విలువైన అవగాహన కలిగించడం జరిగిందని తెలిపారు.

విద్యా పరిశోధన రంగాల్లో ఉన్నత ప్రమాణాలు సాధించడానికి అలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పివిఎస్ శ్రీనివాస్, ఎఫ్‌ఎపి కో-ఆర్డినేటర్ పి. విద్యాసాగర్, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యా సంస్థల నుండి అద్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.