8 June, 2026 | 7:40 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

క్రీడల్లో మెరిసిన బాలికలు

30-10-2024 11:19 AM

కుమురం భీమ్ ఆసిఫాబాద్అసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల అదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అండర్ 14 విభాగంలోని క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కబడ్డీ, ఖోఖో, లాంగ్ జంప్, వ్యక్తిగత ఛాంపియన్‌షిప్, 600 మీటర్ల పరుగు పందెంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న కే వైష్ణవి ప్రథమ స్థానంలో నిలిచింది. 100, 200 మీటర్ల పరుగు పందెంలో శ్రావ్య ప్రథమ స్థానంలో నిలిచింది. ఓవరాల్ ఛాంపియన్ షిప్ లో పాఠశాల విద్యార్థులు నిలిచారు. క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఆర్ సి ఓ గోపి చంద్, పాఠశాల ప్రిన్సిపాల్ రత్నబాయి, ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు అభినందించారు.