calender_icon.png 15 June, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారా సేవా సమితి స్కూల్ లో అదనపు తరగతులను ప్రారంభించిన జిఎం

15-06-2025 12:46:09 AM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి సంస్థ చైర్మన్ బలరాం నాయక్(Singareni Organization Chairman Balaram Naik) ఆదేశాల మేరకు ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య శనివారం గార్లలోని బంజారా సేవ సమితి స్కూల్ లోని అదనంగా నిర్మించిన తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్బంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ.. విద్యార్థులు మంచిగా హెచ్ చదువుకొని స్కూల్ కి ఊరికి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని తెలిపారు. అనంతరం విద్యార్థుల స్పీచ్ లు, వాళ్ళ మైదాశక్తిని గమనించారు. ఈ కార్యక్రమంలో నూతన డీజీఎం పర్సనల్ తుకారం, డీజీఎం సివిల్ రవికుమార్, ఇ ఇ సివిల్ వెంకటేశం, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ అజయ్, జోగిరం తేజావత్, భానోత్ సేన, బంజారా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.