15-06-2025 12:47:27 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): వర్షాకాలంలో నగరాన్ని వర దలు ముంచెత్తకుండా చూసేందుకు హైడ్రా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు 130 మా న్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ను సమాయత్తం చేసేందుకు శనివారం టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. అనంతరం టెక్నికల్ బిడ్, ప్రైస్ బిడ్లను తెరువనుంది.
ఈ బృందాలు ఐదు నెలల పాటు పనిచేయనున్నాయి. లేబర్, వాహనాల సమకూర్పును కలిపి ఇంటిగ్రేటెడ్ టెండర్ను హైడ్రా ఆహ్వానించింది. ప్రతి కార్పొరేటర్ వార్డుకు ఒక వాహనం, ఒక డ్రైవర్, ముగ్గురు లేబర్లతో కూడిన టీమ్ను నియమించనున్నారు. ఈ టెండర్లను 30 ప్యాకేజీలుగా విభజించారు. టాటా ఏస్, మహీంద్రా జీపీ, మారుతి సుజుకి సూపర్ క్యారీ వంటి వాహనాలు లేదా వీటికి సమానమైన ఇతర వాహనాలను సమకూర్చాలని టెండర్లో పేర్కొన్నా రు.
గత ఐదేళ్లలో ఒక్కసారైనా మాన్సూన్ ఎమర్జెన్సీ పనులు చేసిన అనుభవం ఉన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. డే షిఫ్ట్లో పనిచేసే వర్కర్కు రోజుకు రూ.805, నైట్ షిఫ్ట్లో పనిచేసే వర్కర్కు రూ.945.75 చెల్లించనున్నారు. డ్రైవర్కు నెలకు రూ.15,000, వాహనానికి రూ.30,000 చొప్పున చెల్లింపులు జరుగనున్నాయి.
ఈ చర్యలతో మాన్సూన్ సమయంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ జామ్లు, నాలా ప్రమాదాలను నివారించేందుకు హైడ్రా సమర్థవం తంగా పనిచేయనుంది. గతంలో ఇసుజు వాహనాలను ఉపయోగించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్కు రాష్ర్ట ప్రభుత్వం చెక్ పెట్టింది. దీంతో హైడ్రా పాత పద్ధతిలోనే ఈ టీమ్స్ను నిర్వహించాలని నిర్ణయించింది.
51 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్
హైడ్రా ఆధ్వర్యంలో 130 మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ , 51 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ సమన్వయంతో పనిచేయనున్నాయి. నీటి నిల్వలు, ట్రాఫిక్ జామ్లను నివారించడంతో పాటు, నాలాల సురక్షిత పరిశీలన, వర్షం తర్వాత డీసిల్టింగ్ వంటి పనులను ఈ టీమ్స్ చేపట్టనున్నాయి.