8 July, 2026 | 8:44 PM

Breaking News

సమస్యలు పరిష్కరించాలని వినతి   •   ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన చావా రామకృష్ణ   •   ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి   •   ఘనంగా అయ్యప్ప స్వామి 11వ వార్షికోత్సవ వేడుకలు   •   పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •  

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం

08-07-2026 07:57 PM

మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి

సిసి రోడ్లు, డ్రైనేజీల కల్పనకు ప్రాధాన్యత

మున్సిపల్ ను సుందరంగా తీర్చిదిద్దుతా

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, బుధవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 12వ వార్డులో శానిటేషన్ క్లీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఒకటవ వార్డు సుగ్లాంపల్లిలో మున్సిపల్ ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశారు.

అనంతరం  విజయరమణ రావు ను నిలువెత్తు దండతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సుల్తానాబాద్ మున్సిపల్ ను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగానే వార్డులలో సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మాణంతో పాటు రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న శ్రీరాంపూర్ రోడ్డును ఆధునికరించి సెంటర్ లైటింగ్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.  రాబోయే నాలుగు నెలల కాలంలో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని వివరించారు.

1,2,13,14,15 వార్డులలో పనులు మొదటి విడతలో శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రజలు విశ్వాసం ఉంచి 15 వార్డులలో 13 వార్డులు కాంగ్రెస్ అభ్యర్థులను ఘనవిజయంతో గెలిపించడం జరిగిందని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని వివరించారు.మహిళల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాల బలోపేతం, ఉపాధి అవకాశాల కల్పన, మహిళలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన దిశగా నిరంతరం కృషి చేస్తోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు.