16 April, 2026 | 11:53 AM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

లోక కళ్యాణం కోసం గోదావరి పరిక్రమ యాత్ర

15-12-2025 07:10 PM

మంథని (విజయక్రాంతి): గోదావరి పరిక్రమ యాత్ర శ్రీ రాజేంద్ర దాస్ మహారాజ్ బృందావన్ మాలూక్ పీఠాధిపతి ఆధ్వర్యంలో 500 మంది పీఠాధిపతులతో నాసిక్ నుండి బయలుదేరి మంచిర్యాల జిల్లా నుండి బీజాపూర్, చత్తీస్గడ్ మీదుగా భద్రాచలం కొవ్వూరు మీదుగా కాలేశ్వరంలో ఆదివారం రాత్రి బస చేసి సోమవారం త్రివేణి సంగమంలో స్నానాధి కార్యక్రమాలు ముగించుకుని కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని, మంథని మీదుగా ధర్మపురి వెళ్లే వారి యాత్రలో మంథనిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వారిని సవినయంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగా అయోధ్య వారణాసి తదితర పీఠాధిపతులందరూ కూడా ఇక్కడ పాదం మోపడం జరిగింది. 

వాళ్లందరికీ కూడా పండ్లు అందించి, వారి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున హిందూ బంధువులందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొని, విశ్వహిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంథని ప్రకండ ఉపాధ్యక్షులు రావుల సతీష్, బోట్ల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బత్తుల సత్యనారాయణ పర్యవేక్షణలో గర్రెపల్లి వెంకటేశ్వర్లు, కెక్కెర్ల అనిల్, ప్రచారక్ తూర్పాటి రాము, సత్సంగ ప్రముక రాజమౌళి గౌడ్, కొమురవెల్లి, హరీష్ గుండా శ్రీనివాస్, బొడ్డు వెంకటేష్, నూక శ్రీనివాస్, మాచిడి శ్రీధర్, కజ్జం శ్యామ్, కొమురవెల్లి సత్యనారాయణ, బొడ్డు సంపత్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాతృశక్తి ప్రముఖ్ రావికంటి రేణుక, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.