24-06-2025 05:01:16 PM
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వరుసగా అవినీతి నిరోధక బ్యూరో అధికారులు రైడ్స్ చేస్తూ లంచగొండి అధికారులను అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎంత మందిని అరెస్ట్ చేసిన కొంతమంది అధికారుల తీరు మాత్రం మారట్లేదన్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలోని గొడిసెర్యాల్ గ్రామపంచాయతీ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే... నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండంలోని గొడిసెర్యాల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన వాటర్ ప్లాంట్ ఎన్ఓసీ కోసం గ్రామపంచాయతీ పంచాయతీ కార్యదర్శి మార్తి శివ కృష్ణను కలిశారు.
ఎన్ఓసీ ఇవ్వలంటే రూ.15 వేలు డిమాండ్ చేసి చివరిగా రూ.12 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బాధితుడు గ్రామ ప్రకృతివనం వద్ద కార్యదర్శి శివకృష్ణకి లంచంగా రూ.12వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్సీ మధు పట్టుకొని, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు ఎవరు డబ్బులు అడిగిన అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాలని డీఎస్సీ మధు సూచించారు.