calender_icon.png 25 June, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘విధ్వంసం నుంచి వికాసం వైపు..’ పుస్తకం ఆవిష్కరణ

24-06-2025 05:22:11 PM

హైదరాబాద్: తెలంగాణ గాంధీ భవన్ లో పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. 

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ రాష్ట్రాన్ని వికాసం వైపు  కాంగ్రెస్ నడిపిస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలన సబ్బండ వర్గాలకు ఇచ్చిన అభయహస్తం హామీలను నెరవేరుస్తూ ఇంటింటా సౌభాగ్యం నిలిచేలా ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తోందని తెలుపుతూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ రచించిన  ‘విధ్వంసం నుంచి వికాసం వైపు..’ పుస్తకాన్ని  గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.