15 March, 2026 | 10:55 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బంగారం చోరీ

08-11-2024 11:06 AM

హైదరాబాద్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బంగారం అపహరణకు గురైంది. మండపేట నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిల బ్యాగులో నుంచి రూ. 15 లక్షల విలువైన బంగారాన్ని దుండగులు చోరీ చేశారు. బంగారం చోరీకి గురైనట్లు మహిళ నార్కట్ పల్లి వద్ద గుర్తించింది. దీంతో డ్రైవర్ బస్సును అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. బంగారం చోరీపై పోలీసులు ప్రయాణికులను విచారించారు. అనంతరం ప్రయాణికులను అదే బస్సులో పోలీసులు హైదరాబాద్ కు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  బాధితురాలితో కలిసి బస్సు ఆపిన ప్రాంతాలకు పోలీసులు వెళ్లారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.