17 April, 2026 | 10:48 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు

17-04-2026 09:28 PM

నార్కట్ పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి

చిట్యాల,(విజయక్రాంతి): ప్రమాదం జరిగిన వెంటనే ఇచ్చే సహాయం చాలా ముఖ్యమని, గోల్డెన్ అవర్ సమయంలో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చని నార్కట్ పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి  తెలిపారు. శుక్రవారం నార్కెట్‌పల్లి పట్టణంలో గోల్డెన్ అవర్ రెస్పాన్స్ ట్రైనింగ్ కార్యక్రమం  నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సై విష్ణు ఆధ్వర్యంలో, పోలీస్ శాఖ తరఫున మెడికల్ ఆఫీసర్ మరియు 108 సిబ్బంది సహకారంతో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలకు రోడ్డు ప్రమాదాలు మరియు అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత గురించి వివరించారు.

అలాగే సి పి ఆర్  (కార్డీయో పుల్మనరీ రెస్యూసైటేషన్ ) పద్ధతులను ప్రదర్శిస్తూ, ప్రమాద బాధితులకు వెంటనే సహాయం చేయడం ద్వారా ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో వివరించారు. ఈ సందర్భంగా ఎస్సై విష్ణు మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే ఇచ్చే సహాయం చాలా ముఖ్యమని, గోల్డెన్ అవర్ సమయంలో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు. ప్రజలు ఇటువంటి అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, ప్రమాద బాధితులకు సహాయం చేసే విధంగా ముందుకు రావాలని సూచించారు.