17 April, 2026 | 10:50 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన

17-04-2026 09:25 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): విద్యార్థి సియా ఉలేరియాను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో కాలేజీకి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ నాయకురాలు సియా ఉలేరియాపై గంజాయి మత్తులో ఉన్న దుండగులు హత్యకు పాల్పడ్డారని,  హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా గంధసిరి జ్యోతిబసు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదకద్రవ్యాలు మద్యం, గంజాయి లాంటి చెడు వ్యసనాలపై ఉక్కు పాదం మోపాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుండ్ల రాకేష్ నాయకులు వరుణ్, వంశీ, నరసింహ, సందీప్, మధు,సంధ్య, రేష్మ, జాస్మిన్, మానస, మౌనిక, నర్మదా తదితరులు పాల్గొన్నారు.