calender_icon.png 29 June, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్కంపేట ఎల్లమ్మకు గోల్కొండ పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ

29-06-2025 01:46:26 AM

కార్వాన్, జూన్ 28: బల్కంపేట ఎల్లమ్మ తల్లికి గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి దేవాల య వృత్తి పనివారి సంఘం ఆధ్వర్యంలో శనివారం పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం, పసుపు, కుంకుమలు   సమర్పించారు.

ఆషాఢమాసం తొలి బో నం గోల్కొండ ఎల్లమ్మ తల్లికి సమర్ప ణ జరిగిన తర్వాత  బల్కంపేట ఎల్ల మ్మ తల్లికి.. గోల్కొండ ఎల్లమ్మ తల్లికి చెందిన పసుపు పండరాం, పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ  కార్యక్ర మంలో గోల్కొండ ఆలయ ఈఓ వసంత, సలహాదారు నర్సింగ్ రావు పాల్గొన్నారు. 

- నేడు రెండో బోనం  

 గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి ఆదివారం రెండో బోనం సమర్పించనున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు, ఎండోమెంట్ ఈవో వసంత ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆదివారం లక్షల్లో భక్తులు వస్తారని అంచనా మేరకు భారీకేడ్లను పటిష్టం చేశారు. అన్ని విధాలుగా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ చంటిబాబు పేర్కొన్నారు.

ఆదివారం ఉదయం అమ్మ వారికి అభిషేకం తర్వాత ఆభరణాలను ధరింప చేస్తామని వెల్లడించారు. ఉదయం 8 గంటలకు అమ్మవారి విగ్రహం ఎదుట ప్రత్యేకంగా నవధాన్యాలతో పటం వేస్తామని ఈవో వసంత పేర్కొన్నారు. ఏర్పాట్లు ఘనంగా ఉంటాయని చైర్మన్ చంటిబాబు తెలిపారు.