calender_icon.png 29 June, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెండర్లకు ముందే కంపెనీ ఖరారు?

29-06-2025 01:52:41 AM

  1. త్వరలో అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ 
  2. మొబైల్ సరఫరాకు కొనసాగుతున్న టెండర్ ప్రక్రియ
  3. ఈ నెల 30న బిడ్లు తెరవనున్న యంత్రాంగం 
  4. మూడు కంపెనీల మధ్య పోటీ
  5. ఓ కంపెనీకి టెండర్ కట్టబెట్టేందుకు యత్నాలు 

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాం తి): అంగన్‌వాడీ టీచర్లకు అందించే స్మార్ట్‌ఫోన్ల సరఫరాకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తికా క ముందే కొందరు అధికారులు ఓ కంపెనీకి టెండర్ ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్న ట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందుతున్న సేవలు, రోజూవారీ కార్యకలాపాలను అంగన్‌వాడీ టీచర్లు ఎప్పటిప్పుడు ఆన్‌లైన్ చేసి పైఅధికారులకు నివేదించేం దుకుగాను కేంద్ర ప్రభుత్వం వారికి స్మార్ట్‌ఫోన్లు అందజేసింది.

నిబంధనల ప్రకారం నాలుగేళ్లకోసారి వారికి పాత ఫోన్ల స్థానంలో కొత్త ఫోన్లు అందించాల్సి ఉంది. దీనిలో భాగంగానే ఈ ఏడాది కొత్త స్మార్ట్‌ఫోన్స్ అందించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రప్రభుత్వం టీజీ టెక్నాలజీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. వాస్తవానికి యంత్రాంగం ఈ 30వ తేదీ న బిడ్లు తెరిచి మొబైల్ సరఫరాకు ఏ కంపెనీ తక్కువ కోట్ చేస్తుందో..

ఆ కంపెనీకి టెండర్ ఖరా రు చేయాల్సి ఉండగా.. ప్రభుత్వానికి తెలియకుండా ఓ కంపెనీ డీలర్‌కు కొందరు అధికారులు టెండర్ కట్టబెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. టెండర్ దాఖలుకు గడువు ముగియ క ముందే గుట్టుచప్పుడు కాకుం డా ఆ పని పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సామ్‌సంగ్, నోకియాతో పా టు మరో కంపెనీ టెండర్లు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నట్లు సమాచారం.

స్మార్ట్‌ఫోన్‌లో సేవల నమోదు..

రాష్ట్రవ్యాప్తంగా 35,781 అంగన్‌వాడీ కేంద్రా లు ఉండగా, వీటి ద్వారా అంగన్‌వాడీ టీచర్లు ప్రతిరోజూ చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. వారి ఆరోగ్యంపైనా శ్రద్ధ వహించి, వారికి తగిన సూచనలిస్తా రు. నిర్దేశిత సమయాల్లో చిన్నారుల ఎత్తు కొలిచి, వారి బరువు తూచి, వాటిని రికార్డ్ చేస్తుంటారు. పోషణ్ అభియాన్‌లో భాగంగా మరికొన్ని సేవ లు కూడా అందిస్తుంటారు. ఆ సేవలన్నింటినీ ఆన్‌లైన్ చేయాలంటే అంగన్‌వాడీ టీచర్ల చేతిలో తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్లు ఉండాల్సిందే.

కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లకోసారి టీచర్లకు కొత్త మొబై ల్స్ అందించాల్సి ఉండగా, ఈఏడాది స్మార్ట్‌ఫోన్స్ అందించాల్సిన సమయం వచ్చింది. వాటి కొనుగోలుకు అవసరమయ్యే ఖర్చునంతా కేంద్ర మే భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఒక్కో మొబైల్‌కు రూ.10 వేల చొప్పున కొనుగోలు చేయాలని యంత్రాంగం భావిస్తున్నట్లుగా సమాచారం. 

కమిటీ ఆధ్వర్యంలో ఖరారు..

తెలంగాణ ప్రభుత్వం మొబైల్ సరఫరాకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో అమలవుతున్న విధానాన్నే చేయాలని యోచిస్తున్నది. అక్కడి ప్రభుత్వాలు ఓ ప్రముఖ కంపెనీకి చెంది న స్మార్ట్‌ఫోన్లనే ప్రభుత్వాలు అందించినట్లు తెలిసింది. సదరు కంపెనీ స్మార్ట్‌ఫోన్ అన్నివిధాలా అనుకులంగా ఉందని, అంగన్‌వాడీలకు అనువై న ఫీచర్లు, అవసరమైన సాఫ్ట్‌వేర్స్ అన్నీ దానిలో ఉన్నాయని గుర్తించింది. కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్‌నే కొనుగోలు చేయాలని ప్రభుత్వం సిద్ధమైనట్లు అధికారవర్గాల విశ్వసనీయ సమాచారం.

ఈక్రమంలోనే కంపెనీ డీలర్ల నుంచి ప్రభుత్వం టెండ ర్లు ఆహ్వానిస్తున్నట్లు, టీజీ టీఎస్, ఐటీ పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులతో ఓ కమిటీని వేసింది. మార్గదర్శకాలు, నిబంధన లు, ప్రమాణాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఏదైనా ఒక కంపెనీకి స్మార్ట్‌ఫోన్ టెండర్ ఖరారు చేస్తుంది. టెండర్ల విషయంలో వస్తున్న ఆరోపణలపై ‘విజయక్రాంతి’ఆ శాఖ అధికారిణి సృజనను వివరణ కోరగా.. స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన టెండర్లు ఇంకా ఖరారు కాలేదన్నారు.