26-06-2025 12:17:23 AM
అంతరిక్షంలోకి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా
* భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం మొదలైంది. కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, ఆశీస్సులను గుండెల నిండా నింపుకొని 41 ఏళ్ల తర్వాత మన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సగర్వంగా రోదసిలోకి పయనమయ్యారు. యాక్సియం-4 మిషన్లో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 12.01 గంటలకు ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.
ఫ్లోరిడా, జూన్ 25: భారతీయులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. బుధవారం యాక్సి యం- 4 మిషన్లో శుభాంశుతో పాటు మరో ము గ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరి వెళ్లారు. వీరు ప్ర యాణిస్తున్న ఫాల్కన్-9 రాకెట్ ఫ్లోరిడాలో ని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ ను ంచి భారత కాలమాన ప్రకారం మధ్యా హ్న ం 12.01 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.
ఆ తర్వాత కొద్ది క్షణాలకే రాకెట్ నుంచి వీరి క్యాప్సుల్ విడిపోయి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) దిశగా ప్రయా ణం కొనసాగించింది. 28 గంటల ప్రయా ణం త ర్వాత గురువారం సాయంత్రం 4.30 గంటలకు వీరి వ్యోమనౌక అంతర్జాతీయ ఐ ఎస్ఎస్తో అనుసంధానం అవనుంది. ఐఎస్ఎస్లో శుభాంశు బృందం 14 రోజుల పా టు ఉం టుంది.
యాక్సియం-4 మిషన్కు శుభాంశు పైలెట్గా వ్యవహరించనుండగా.. మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్ (అమెరికా), స్పెషలిస్టులు టిబర్ కపు (హంగేరీ), స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నియెస్కీ (పోలండ్) రోదసిలోకి వెళ్లారు. ఐఎస్ఎస్లో శుభాంశు ఇస్రో తరఫున ఏడు ప్రయోగాలు నిర్వహిస్తారు.
ప్రధాని మోదీ, పాఠశాల వి ద్యార్థులు, ఇతరులతో అక్కడి నుంచి ముచ్చటించనున్నారు. మొత్తంగా యాక్సియం-4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు. కాగా శుభాంశు అ ంతరిక్ష యాత్రం కోసం భారత్ రూ. 550 కోట్లు ఖర్చు చేసినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది.
నమస్తే ఇండియా.. మీరంతా నా వెంటే: శుభాంశు
అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా భారత పౌరులను పలకరించారు. ‘ నా ప్రియమైన దేశ ప్రజలకు నమస్కారం. 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షాన్ని చేరుకున్నాం. ఇదో గొప్ప ప్రయాణం. ఇప్పుడు మేం భూకక్ష్యలో సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాం. నా భుజాలపై మన త్రివర్ణ పతాకం ఉంది.
అది చూస్తుంటే నాతో మీరంతా ఉన్నారనే భావన కలుగుతోంది. ఈ ప్రయాణంలో మీరంతా భాగమవ్వాలని కోరుకుంటున్నా. మన దేశ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాన్ని మనమంతా కలిసి ప్రారంభిద్దాంం. జైహింద్. జై భారత్’ అని శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు.
కోట్ల మంది ఆకాంక్షలను మోసుకెళ్లారు: మోదీ
భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా కోట్ల మంది భారతీయుల కలలు, కోరికలు, ఆంక్షలను మోసుకెళ్లారన్నారని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ నుంచి గ్రూప్ కెప్టెన్గా వెళ్లిన శుభాంశు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిని సృష్టించారని.. నాసా, ఇస్రో మధ్య శాశ్వత భాగస్వామ్యం విజయంవంత కావాలని రాష్ట్రపతి ముర్ము ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చేస్తున్న ప్రయాణం దేశ ప్రజలందరికీ గర్వకారణమని ప్రకటనలో తెలిపారు.
41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి.. ఎవరీ శుభాంశు?
అంతరిక్ష ప్రయాణం అనేది ఒక కల. దానిని సాకారం చేసుకుంటూ మన దేశం గర్వపడేలా భారత వైమానిక దళం నుంచి 41 ఏళ్ల తర్వాత అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెడుతున్న భారతీయుడిగా శుభాంశు శుక్లా నిలవనున్నారు. రాకేశ్ శర్మ (1984) తర్వాత అంతరిక్షంలోకి పయనం కానున్న రెండో భారతీయుడిగా నిలవనున్నారు.
మన దేశ ప్రతిష్ఠాత్మక గగన్యాన్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా ఒకరు. లక్నోకు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అలీగంజ్లోని సిటీ మాంటేస్సరి స్కూల్ పూర్వ విద్యార్థి. 2006లో భారత వైమానిక దళంలో చేరిన శుక్లా, ఒక ఫైటర్ పైలెట్గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
ఆయనకు 2వేలకు పైగా విమానం నడిపిన అనుభవముంది. 16 సంవత్సరాలుగా దేశ సేవకు అంకితమైన ఆయన తన ఏవియేషన్ కెరీర్లో సు-30ఎంకేఐ, మిగ్-21, మిగ్-29, జాగ్వార్, హాక్ వంటి చాలా యుద్ధ విమానాలను నడిపారు. గత ఎనిమిది నెలలుగా ఆయన నాసా, యాక్సియం స్పేస్తో కలిసి కఠినమైన శిక్షణ తీసుకున్నారు.
ఆనంద క్షణాలు..
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మొదలవ్వగానే ఆయన కుటుంబసభ్యులు భావోద్వే గానికి గురయ్యారు. కుమారుడి యాత్రను చూసిన సంతోషంతో తల్లి ఆశా శుక్లా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె పక్కన కూర్చున్న తండ్రి శంభు దయాళ్ శుక్లా ఉత్సాహంగా కనిపించగా.. శుభాంశు భార్య కామ్నా శుక్లా తన భర్త అంతరిక్ష ప్రయోగం జరుగుతున్నంత సేపు ఉత్కంఠగా తిలకించారు.
1984లో అంతరిక్షంలోకి రాకేశ్ శర్మ
1984లో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. రష్యా సహకారంతో ఏప్రిల్ 3, 1984న సోవియట్ యూనియన్ రాకెట్ (సోయూజ్ టి-11) ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. సోవియట్ అంతరిక్ష కేంద్రంలో 7 రోజుల 21 గంటల పాటు రాకేశ్ గర్మ గడిపారు. 1949, జనవరి 13న పాటియాలలో రాకేశ్ శర్మ జన్మించిన రాకేశ్ శర్మ 1966లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎయిర్ఫోర్స్లో జాయిన్ అయ్యారు. 1970లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్గా నియమితులయ్యారు. 1971లో పాకిస్తాన్తో యుద్ధం సమయంలో రాకేశ్ శర్మ మిగ్-21 విమానాలు నడిపారు.