26-06-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూన్ 25: దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిన ఎమర్జెన్సీవిధించి బుధవారంతో 50 ఏళ్లు పూర్తయ్యాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితికి కారణమైన నాటి కాంగ్రెస్పై మోదీ నిప్పులు చెరిగారు. ‘ఆ చీకటి అధ్యాయానికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. దీన్ని ‘సంవిధాన్ హత్య దివస్’గా ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.
యాబై ఏళ్ల క్రితం ఇదే రోజున భారత రాజ్యాంగ విలువలను పక్కనబెట్టి, ప్రాథమిక హక్కులను అణచివేసి, పత్రికా స్వేచ్ఛను కాలరాసి ఎంతోమందిని జైలుకు పంపించారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్భందించి రాజ్యాంగ స్పూర్తిని ఉల్లంఘించి ప్రవర్తించిన తీరును ఎవరూ మరిచిపోలేరు.
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నాం. ఎమర్జెన్సీ సమ యంలో నేను యువ ప్రచారక్గా పనిచేస్తున్నా. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం ఎన్నో పాఠాలు నేర్పింది’ అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన అనుభవాలను వివరిస్తూ ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పేరుతో ఒక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్టు మోదీ తెలిపారు.