25-06-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూన్ 24: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ చందాదారు లకు శుభవార్త తెలిపింది. ఇకపై రూ. 5 లక్షల వరకు అడ్వాన్స్ క్లెయిమ్స్ను ఆటోమేటిక్గా పరిష్కరించనున్నట్టు మంగళవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్మాండవీయ తెలియజేశారు. ప్రస్తుతం రూ. లక్షగా ఉన్న ఆటోసెటిల్మెంట్ పరిమితిని రూ. 5 లక్షల వరకు పెంచినట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో త్వరితగతిన ఈపీఎఫ్ఓ నిధులు కావాల్సిన చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మంది ఈపీఎఫ్ఓ చందాదారులున్నారు. మార్చి 28న జమ్మూలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 113వ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లోనే కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా డావ్రా ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేశారని కార్మిక మం త్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నిర్ణ యం ద్వారా చందాదారుల క్లెయిమ్స్ మరిం త వేగంగా ప్రాసెస్ కానున్నాయి. ఆటోమేటెడ్ పద్ధతిలో మానవుల ప్రమేయం ఉండ దు. అవసరం అయిన అన్ని రకాల డాక్యుమెంట్లు ఉంటే ఆటోమేటిగ్గా క్లెయిమ్ పరి ష్కారం అవుతుంది. ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఆటో క్లెయిమ్ విధానం ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతోంది. ఈపీఎఫ్ఓ కరోనా సమయంలో ఈ తరహా క్లెయిమ్ సెటిల్మెంట్ పద్ధతిని తీసుకొచ్చింది.
మొదట్లో తక్కువగా ఉన్న పరిమితిని ప్రస్తుతం రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆటోక్లెయిమ్స్ సంఖ్యలో గణనీయమైన వృద్ధి కనిపి స్తోంది. గతేడాది మార్చి 6 వరకు కేవలం 89.52 లక్షల క్లెయిమ్స్ మాత్రమే ఉండగా.. ఈ ఏడాది మార్చి 6 వరకు క్లెయి మ్స్ సంఖ్య 2.16 కోట్లకు చేరుకుంది.
వీటిలో 95 శాతం క్లెయిమ్స్ కేవలం మూడు రోజుల్లోనే సెటిల్ అవ్వడం విశేషం . ‘ఆటో సెటిల్మెం ట్ ప్రాసెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ను సులభతరం చేసింది. హ్యూమన్ వెరిఫికేషన్ అవస రం లేకుండా చేసింది.’ అని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి తెలిపారు. ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ క్లెయిమ్ తిరస్కరణ రేటు కూడా 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గడం గమనార్హం.