calender_icon.png 26 June, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

400 కేజీల యురేనియం ఎక్కడ?

25-06-2025 12:00:00 AM

అణు కేంద్రాలపై దాడులకు ముందే తరలించిన ఇరాన్

  1. 10 అణు బాంబులు తయారు చేయొచ్చని అంచనా
  2. యురేనియం నిల్వలు కనుక్కునేందుకు అమెరికా చర్యలు

న్యూఢిల్లీ, జూన్ 24: ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ అంశం తెరమీదకు వచ్చినప్పటికీ ఒక విషయం మాత్రం కలవరపెడుతోంది. అణుబాంబుల తయారీలో కీలకమైన 400 కేజీల యురేనియం మిస్సవడం ఆందోళనకు గురి చేస్తుంది. ఇరాన్ వద్ద ఇప్పటికీ అణ్వాయుధాలను తయారు చేసేందుకు అవసరమైన ఎన్‌రిచ్డ్ యురేనియం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యుద్ధంలోకి అమెరికా రంగ ప్రవేశం చేసి ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా దాడులకు ముందే ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవ హరించిందని, 400 కేజీల ఎన్‌రిచ్డ్ యురేనియాన్ని గుట్టుచప్పుడు కాకుండా వేరే చోటికి తరలించిందని సమాచారం. ఇరాన్ తరలించిన 400 కేజీల యురేనియంతో సుమారు 10 అణు బాంబుల తయారు చేయవచ్చనేది ఒక అంచనా.

మిస్సింగ్ యురేనియం 60 శాతం ఎన్‌రిచ్ అయిందని, దానిని 90 శా తం ఎన్‌రిచ్ స్థాయికి తీసుకెళ్తే అణ్వాయుధాలలో ఉపయోగించవచ్చని నిపుణులు పే ర్కొంటున్నారు. అణు కేంద్రాలపై దాడుల కు ముందే ఇరాన్ తాము నిల్వ ఉంచిన యు రేనియాన్ని ప్రత్యేక డబ్బాల్లో, చిన్న చిన్న కంటైనర్లలో పెట్టి ట్రక్కులో, కార్లలో మరో అండర్ గ్రౌండ్ స్థలానికి తరలించి ఉండొచ్చని ఇజ్రాయెల్, అమెరికా ఇంటెలిజెన్స్ వ ర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

వీటి ల్లో కొంత ఫోర్డో అణుకేంద్రం నుంచి తరలించినట్టు అంచనా వేస్తున్నారు. అమె రికాకు చెందిన మ్యాక్సర్ టెక్నాలజీస్ జూన్ 19న ఈ ప్రదేశంలో 16 ట్రక్కుల కదలికలను గుర్తించింది. యురేనియం వినియోగం శాంతియుత అవసరాలకేనని ఇరాన్ మొద టి నుంచి చెబుతుండగా, అణ్వాయుధాల తయారీని సహించేది లేదంటూ ఇజ్రాయెల్ దాడులకు దిగడంతో ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారి తీసింది. 

ఆ యురేనియం ఎక్కడుందో తెలుసు: నెతన్యాహు

ఇరాన్ శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఎక్కడ దాచిందో తమకు తెలుసునని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ తాము నిల్వ చేసుకున్న యురేనియంను ఒక రహస్య ప్రదేశానికి తరలించిందని ఇంటలిజెన్స్ వర్గాలు తమకు రిపోర్టు అందించాయన్నారు.

అయితే ఆ వివరాలు వెల్లడించమన్నారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాత్రం ఇరాన్ యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయో తమకు తెలియదని.. వాటిని కనుక్కునే దిశగా అమెరికా చర్యలు చేపడుతుందని తెలిపారు.